నాగ చైతన్య, సమంత జంటగా నటించిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ఏమాయ చేసావె. ఈ సినిమా విడుదలై 12 ఏళ్లు పూర్తైంది. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత నటిగా తెరంగ్రేటం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
ఇన్ని ఏళ్లుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పారు. సినీ పరిశ్రమలో తన ప్రయాణం మొదలై 12 ఏళ్లు పూర్తైందని..లైట్స్, కెమెరా, యాక్షన్.. వీటి చుట్టూ తనకున్న మధుర జ్ఞాపకాలు, అద్భుతమైన అనుభూతులకు గుర్తు చేసుకున్నారు. ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలని పోస్ట్ చేశారు.
ఏమాయ చేసావె సినిమాతో నాగచైతన్య, సమంత తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా షూట్లోనే వాళ్లిద్దరూ స్నేహితులయ్యారు. గతేడాది వాళ్లిద్దరూ తమ వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ చెప్పిన క్రమంలో సమంత.. తన తొలి చిత్రం గురించి పోస్ట్ పెట్టడం కాస్త వైరల్గా మారింది.