Sunday, April 28, 2024
- Advertisement -

నాగార్జున పై సంపూర్ణేష్ బాబు పై చేయి

- Advertisement -

నాగార్జున అక్కినేని ప్రధాన పాత్ర లో త్వరలో విడుదల కానున్న ఆసక్తికర చిత్రం మన్మధుడు 2. ఈ సినెమా ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా కి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయిపోయాయి. కాకపోతే ఇంకా ఫుల్ అవ్వడం లేదు. 9 న ఈ సినిమా విడుదల అవుతుంటే 10 న సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరి మట్ట సినిమా విడుదల అవుతుంది. అయితే అనూహ్యం గా మన్మధుడు తో పోలిస్తే కొబ్బరి మట్ట కి బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి.

నాగార్జున నటించిన మన్మధుడు సినిమా కి సంబందించిన ఐమాక్స్ థియేటర్ టికెట్స్ ఇంకా దొరుకుతూ నే ఉన్నాయి కానీ కొబ్బరి మట్ట కి సంబంధించి ఒక షో ఫుల్ కాగా, మరొక షో బుకింగ్స్ కూడా పెట్టడం జరిగింది. చూస్తుంటే సంపూర్ణేష్ బాబు కి క్రేజ్ ఎక్కువ గా ఉన్నట్టు కనిపిస్తుంది. సాధారణంగా ఉదయం పూ ఐమాక్స్ లో పడే షో కి ఆసక్తి చూపించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ అదేంటో గాని నాగార్జున లాంటి పెద్ద హీరో సినిమా కాదని సంపూర్ణేష్ బాబు సినిమా మీద ఆసక్తి కనబరుస్తున్నారు ప్రేక్షకులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -