Friday, May 3, 2024
- Advertisement -

సమంత ఇంటిని సొంతం చేసుకున్న అఖిల్ లవర్

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్.. ముఖ్యంగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే విధంగా అవకాశాలు అందుకోవడమే కాకుండా.. అవకాశాలు లేనప్పుడు ఎలా ముందుకెళ్లాలని కూడా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే తెలుగులో ఛాన్సులు అందుకోవడం కోసం.. హైదరాబాద్ లోనే ఓ సొంత ఇల్లు చూసుకోవాలని.. ఎక్కడినుంచో వచ్చిన బ్యూటిలు ఇక్కడ తిష్ట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్, రాశిఖన్నా లాంటి హీరోయిన్స్ హైదరాబాద్ లో సొంతంగా ఇల్లు కొనుక్కుని సక్సెస్ కాగా, ఇప్పుడు మరో టాలెంటెడ్ బ్యూటీ అదే ప్లాన్ ను ఇక్కడ అప్లై చేస్తోంది. ఆ స్టోరీలోకి వెళితే, అక్కినేని అఖిల్ కు లవర్ గా నటించి, ‘అఖిల్’ సినిమాతో తెలుగులోకి పరిచయం అయిన సాయేషా సైగల్ ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొనేసిందట. బాలీవుడ్ లో మంచి బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఈ బ్యూటీ.. ఎప్పటినుంచో ఇక్కడ ప్రాపర్టీ కొనాలని ప్లాన్ చేస్తుండగా, అది ఇప్పటికి నెరవేరిందట. ఇక ఇక్కడ అసలైన విశేషం ఏంటంటే.. సాయేషా సైగల్ సొంతం చేసుకుంటున్న ఆ ఇంటిలో గతంలో సమంత ఉండేదట. ఇప్పుడు అదే హౌస్ అమ్మకానికి రావడంతో అఖిల్ లవర్ ఇంకేమీ ఆలోచించకుండా కొనేయడానికి ముందుకొచ్చిందట. దీంతో ఇక్కడ షూటింగ్స్ ఉన్నప్పుడు దాదాపుగా హైదరాబాద్ లోనే ఉంటూ టాలీవుడ్, కోలీవుడ్ లలో మరిన్ని సినిమా ఛాన్స్ లు దక్కించుకోవాలని సాయేషా ఫిక్స్ అయిపోయిందట. మరి ప్రస్తుతానికి కోలీవుడ్ ప్రాజెక్ట్స్ తో కొంచెం బిజీగా ఉన్న సాయేషా.. ఇప్పుడు హైదరాబాద్ హౌస్ తో టాలీవుడ్ లో బిజీ అవుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -