సందేశాత్మక సినిమాలు తీయడంలో నందమూరి బాలకృష్ణ ముందుంటాడు. లెజెండ్, సింహా తదితర సినిమాలు కూడా యాక్షన్తో పాటు సందేశం ఇచ్చిన సినిమాలు. ఇప్పుడు బాలకృష్ణ ‘జై సింహ’లో కూడా భావోద్వేగాలకు పెద్దపీట వేసి పండుగ నాడు కన్నీళ్లు పెట్టించనున్నాడట. భావోద్వేగాల సన్నివేశాల్లో ప్రకాశ్రాజ్, బాలకృష్ణ జీవించారంట.
సంక్రాంతి బరిలో జనవరి 12వ తేదీన జై సింహా సినిమా విడుదలకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమా రజనీకాంత్ గతంలో నటించిన ముత్తు చిత్రం మాదిరి ఉంటుంది అని సమాచారం. సినిమా సెకండాఫ్లో మొత్తం సెంటిమెంట్ సన్నివేశాలతో నిండి ఉంటుంది అని టాక్. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టకుండా ఉండలేరు అని చిత్రబృందం చెబుతోంది. ప్రకాశ్రాజ్, బాలకృష్ణ ఇద్దరూ కలిసి కన్నీళ్లు పెట్టే సన్నివేశాలు కుటుంబ నేపథ్య సినిమాగా తెరకెక్కిస్తున్నారు. సినిమా పాటల విడుదల వేడుకలో బాలకృష్ణ, చిత్ర నిర్మాత సి.కల్యాణ్, రచయిత రత్నం కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తమ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సి.కల్యాణ్ సినిమాను నిర్మిస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నయనతార, నటాష, హరిప్రియ నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.