- Advertisement -
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.ఒక్క సినిమా ఫెయిలర్తో ఇండస్ట్రీలో ఎక్కడ కనిపించకుండపోయారు శ్రీకాంత్ అడ్డాల.మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మాత్సవం సినిమాకు డిజాస్టర్ అవ్వడంతో ఆయన ఎక్కడ కనిపించలేదు.బ్రహ్మాత్సవం ఫెయిల్యూర్ తరువాత శ్రీకాంత్తో సినిమా చేసేందుకు ఏ హీరో ముందుకు రాలేదు.
అయితే ఇటువంటి సందర్భంలోనే హీరో శర్వానంద్కు ఓ కథని వినిపించాడు శ్రీకాంత్.కథ నచ్చడంతో శర్వా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.అన్నదమ్ముల కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో యంగ్ హీరో నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.