Sunday, May 19, 2024
- Advertisement -

శింబు, నయనతారల మధ్య కొత్త గొడవ ఏంటి?!

- Advertisement -

ఇప్పటికే పలు వివాదాలతో వార్తల్లోకి వచ్చారు శింబు నయనతారలు. ఒకదశలో ప్రేమికులుగా వార్తల్లో నిలిచి.. హీటెక్కించిన ఈ హీరో హీరోయిన్లు.. ఆ తర్వాత లిప్ లాక్ లూ గట్రా వెలుగు చూడటంతో సంచలనంగా మారారు.

నయనతారను చుంభిస్తూ శింబూ ఫోటోలు తీసుకొన్నాడు. ఆ తర్వాత అవి ఎలా వెలుగులోకి వచ్చాయో కానీ వచ్చాయి. అలా రావడం వెనుక శింబూనే ఉన్నాడనే వార్తలూ వచ్చాయి.

అంతలోనే ఈ ఇద్దరికీ బ్రేకప్ అయ్యింది. ఎవరి దారి వారు చూసుకొన్నారు. ఆ తర్వాత ఎవరి ప్రేమలో వారు మునిగిపోయారు. ఆ కథల సంగతలా ఉంటే.. ఈ హీరో, హీరోయిన్ల మధ్య మళ్లీ దూరం తగ్గింది. పాత విషయాలను మరిచిపోయి.. ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు! ఆ సినిమా పేరే ఆసక్తికరం. దాని పేరు “ఇదు నమ్మ ఆళు” తెలుగులో చెప్పాలంటే “ఈ అమ్మాయి నాది”. ఈ సినిమా మొదలై ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచాయి. అయితే ఎందుకో పూర్తి కాలేదు.

ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా లో ఒక ప్రత్యేక సాంగ్ ను పెడితే బాగుంటుందని ఫీలవుతున్నారట శింబుతండ్రి రాజేందర్. అయితే తను ఇప్పటికే ఈ సినిమాకు కేటాయించాల్సిన డేట్స్ ను పూర్తి చేశానని.. ఇప్పుడు మళ్లీ డేట్స్ ఇచ్చే ప్రసక్తే లేదని నయనతార తేల్చి చెబుతోంది. ఈ విషయమై నిర్మాత అయిన రాజేందర్ నడియగర్ సంఘం వరకూ వెళ్లాడు. అయితే అక్కడ కూడా శింబు వాళ్లకే ఎదురుదెబ్బే తగిలింది. నయనతారే గెలిచింది. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -