మీటూ కార్యక్రమంతో తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి కొందరు మహిళలు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా ,నాన పటేకర్ నాపై అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పడంతో ఈ మీటూ ఉద్యమం మొదలైంది.అప్పటి నుంచి మీటూ అనే పదంతో మహిళలు తమపై జరిగిన అకృత్యాలపై నోరు విప్పుతున్నారు.తెలుగు సింగర్ చిన్మయి కూడా తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతూ….కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రఘు దీక్షిత్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఒకసారి ఇంటికి పిలిచి తోటి స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్థించాడని చెప్పడంతో ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీలో ఆ న్యూస్ వైరల్ అయ్యింది.
అయితే రఘు దీక్షిత్ ఆమె చేసిన ఆరోపణలకు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. “నేను లైంగిక దాడి చేసినది నిజమే. అందుకు బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నా. చిన్మయి చెప్పిన ఒక సింగర్తో తప్పుగా ప్రవర్తించాను. పాట రికార్డింగ్ టైమ్లో ఉద్వేగానికి లోనై కౌగిలించుకున్న. ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేశా. అయితే అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో వెనక్కి తగ్గాను. అయితే అప్పుడే ఆమెకు క్షమాపణలు చెప్పాను. మరోసారి బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నా” అని రఘు వివరణ ఇచ్చారు. ఇప్పటికే తీవ్రంగా మారిన మీటూ ఉద్యమం ,ఇంకెన్ని విషయాలను బయటపెడుతుందో చూడాలి.