- Advertisement -

లోకేష్ ఇలాకాలో లైంగిక వేధింపుల కలకలం!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైద్య సంస్థ AIIMS పరిధిలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోని ఎయిమ్స్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న లక్ష్మి తిరుపతమ్మ అనే మహిళ, అధికారి ఆచారి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బాధితురాలు తనపై అన్యాయంగా చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించారని కూడా ఆరోపించింది. ఈ ఘటనపై ఆమె రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, ఇదే సంస్థలో ఇటీవల మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఒక సెక్యూరిటీ గార్డు రోగి బంధువుపై ఆకారణంగా దాడి చేసి గాయపరిచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వరుస ఘటనలు సంస్థలో భద్రత, నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయటపెడతామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -