Friday, May 17, 2024
- Advertisement -

‘కేజీఎఫ్’ హీరో చంపాలని చుశాడు.. ఎన్‍కౌంటర్ చేసిన పోలీసులు..!

- Advertisement -

కన్నడనట తీవ్ర కలకలం రేగింది. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యాశ్ హత్యకు కుట్ర చేసిన భరత్ అలియాస్ స్లమ్ భరత్ అనే మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపారు.

యశ్ ను హత్య చేసేందుకు భరత్ గత ఏడాదిగా ప్లాన్ చేస్తుండగా.. తన ప్లాన్ అమలు చేయకముందే పోలీసులు అతని ఎన్ కౌంటర్ చేశారు. ఇక భరత్ పై ఓ మర్డర్ కేసుతో పాటు 50కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే యూపీలో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కర్ణాటకకు తీసుకువచ్చి.. ఓ సీన్ రీ కనస్ట్రక్షన్ కోసం బయటకు తీసుకెళ్లగా.. అతను పోలీసులపై దాడి చేశాడని.. దాంతో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనలో భరత్.. ఓ పోలీసు వద్ద రివాల్వర్ లాక్కుని కాల్పులు జరిపాడని.. అయితే పోలీసులు ముందు జాగ్రత్తగా బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ ధరించడంతో ఎటువంటి హానీ జరుగలేదని.. ఆపై భరత్ మరో వాహనంలో పారిపోతుండగా, ఛేజ్ చేసి ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఓ అధికారి తెలిపారు. తొలుత ఓ బుల్లెట్ కడుపులోకి, ఆపై మరో బుల్లెట్ కాలిలోకి దిగిందని, అతన్ని చికిత్స నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించినా, అప్పటికే పరిస్థితి విషమించి అతడు మరణించాడని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -