కరుణాకరన్ ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ స్నేహా ఉల్లాల్ . అప్పట్లో జూనియర్ ఐశ్వర్యరాయ్గా గుర్తింపు తెచ్చుకుంది.ఈ ముంబై భామ తెలుగులో వరసపెట్టి సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. సింహ సినిమాలో బాలయ్య సరసన నటించినా పెద్దగా అవకాశాలు రాలేదు.
ప్రస్తుతం స్నేహుల్లాల్ ఆస్పటల్లో చేరింది. తనకి ‘ఆటో ఇమ్యూన్ డిసార్డర్’ అనే వ్యాధి సోకిందని, దాని వలన కనీసం 30 నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నానని ఆ మధ్య స్నేహా ఉల్లాల్ తెలిపింది. ఆస్పత్రిలో బెడ్పై పేసెంట్లా పడుకొని ఉన్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో స్నేహా పోస్ట్ చేసింది.
‘నా జీవితంలో తొలిసారి నేను ఆస్పత్రిలో చేరాను. నాకు విపరీతంగా జ్వరం వచ్చింది. ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా నయం కాలేదు. చాలా భయపెట్టింది. కానీ, ప్రస్తుతం నా ఆరోగ్యం కాస్త బాగానే ఉంది. వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. అలా చేయడం చాలా బోరింగ్గా అనిపిస్తోంది కాని నా దగ్గర నెట్ఫ్లిక్స్, నన్ను జాగ్రత్తగా చూసుకునే మనుషులు ఉండటంతో బోరింగ్గా అనిపించడంలేదని ఇన్స్టాగ్రాంలో తెలిసింది.