Thursday, April 25, 2024
- Advertisement -

హైదరాబాద్ లో అల్లు అర్జున్ ’పుష్ప’

- Advertisement -

డైరెక్ట‌ర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆయ‌న తీసే సినిమాలు, ఆయ‌న రాసే క‌థ‌ల‌ను చూస్తే.. ఆయ‌నేంటో అర్థం అవుతుంది. అందుకే టాప్ హీరోలు సైతం సుకుమార్ డైరెక్ష‌న్ లో సినిమాలు చేసేందుకు ఉత్స‌హ ప‌డుతుంటారు. ఆయ‌న శిష్యులు కూడా ఆయ‌న‌లాగే ఆలోచిస్తుంటార‌ని అర్థం అవుతుంది. దానికి సాక్ష్యమే ఉప్పెన సినిమా.

ఇక సుకుమార్ లేటెస్ట్ సినిమా ద‌గ్గ‌ర‌కు వ‌స్తే.. అల్లు అర్జున్ తో తీస్తున్న పుష్ప సినిమాపై ఇప్ప‌టికే అంచ‌నాలు ఆకాశాన్ని అంటాయి. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత సుకుమార్ తీస్తున్న సినిమా కావడంతో అంద‌రి దృష్టి ఈ సినిమాపై ప‌డింది. దీనిపై బిజినెస్ కూడా 100 కోట్లకు పైగానే జరుగుతుంద‌ని ప‌లువురి అంచ‌నా.

ఇప్పటికే పుష్ప షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయ్యింది. ఎర్రచందనం స్మ‌గ్లింగ్ నేపథ్యంలో వస్తున్న కథ కావడంతో ఎక్కువగా అడవుల్లోనే షూట్ చేయాల్సి వ‌స్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవుల్లో షూటింగ్ అంటే ఎంత క‌ష్టంతో కూడుకున్న ప‌నో మ‌న‌కు తెలిసిందే. ఏపీలోని మామిడిపల్లి సమీపంలో పుష్ప షూటింగ్ మొన్న‌టివ‌ర‌కు జ‌రిగింది. కానీ యూనిట్ స‌భ్యుడు ఒక‌రు క‌రోనాతో చ‌నిపోవ‌డంతో షూటింగ్ కు ప్యాక‌ప్ చేప్పాడు.

అలాగే ప‌లు కార‌ణాల‌తో అడ‌వుల్లో షూట్ చేయ‌లేమ‌ని సుకుమార్ అనుకుంటున్నార‌ట‌. అందుకే ఒక భారీ నిర్ణ‌యాన్ని తీసుకున్నాడ‌ట‌. అడ‌వి సెట్ ను హైద‌రాబాద్ లో వేయించే ప‌నిలో ఆయ‌న ఉన్నాడ‌ట‌. అనుకున్న‌ట్లుగానే సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నామ‌ని చిత్ర యూనిట్ తెలుపుతోంది.

త్వ‌ర‌లోనే వెండితెర‌పై నాగార్జున బ్ర‌హ్మ‌స్త్ర‌

కీచ‌క ప్రిన్సిప‌ల్ కు ఉరిశిక్ష‌.. స‌హ‌క‌రించిన టీచ‌ర్ కు జీవిత ఖైది!

మ‌ళ్లీ ఒక‌టిగా క‌నిపించ‌నున్న షారుఖ్, స‌ల్మాన్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -