టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తన మాటాలతో వార్తల్లో నిలిచింది.తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రావలంటే పడుకోవాలని చెప్పి సంచలనం సృష్టించింది శ్రీరెడ్డి.తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వాడుకున్నాడని నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్పై ఆరోపణలు చేసింది.తనకు న్యాయం కావలంటు ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డిని మీడియా వారు కొన్నాళ్లు బాగానే మోసారు.తరువాత మీడియాపై కూడా విమర్శలు రావడంతో మీడియా సైతం ఆమెను పట్టించుకోవడం మానేసింది.
దీంతో ఆమె తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయి అక్కడ ప్రముఖ సినీ ఇండస్ట్రీ పెద్దలపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది.మళ్లీ టాలీవుడ్పై ఫోకస్ పెట్టినట్లుంది. ఎంపీ కవితపై కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. తాజాగా ఆమె విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలపై స్పందించారు. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల కంటే ఆర్ధిక అంశాలకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని ఇది మహిళలను అవమానించినట్లేనని శ్రీరెడ్డి వెల్లడించింది.
ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో జరిగిన గొడవల గురించి ప్రస్తావిస్తూ.. ఆర్ధిక లావాదేవీలపై శివాజీరాజా, నరేష్ మధ్య వివాదం చెలరేగడం, తరువాత రెండు రోజులకే సమస్య పరిష్కారమైందని చెప్పడం చూస్తుంటే ఆర్ధిక అంశాలే కీలకమైనవనే అభిప్రాయం కలుగుతుందని అన్నారు.ఎంపీ కవిత కూడా మహేష్ బాబు, విజయ్ దేవరకొండ సినిమాల గురించే మాట్లాడతారు కానీ మహిళల అంశాలను పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోందని అన్నారు.