పదాహారేళ్ల వయసుతో వచ్చి కుర్రకారులో గిలిగింతలు పెట్టి ఆ తర్వాత వరుస సినిమాలతో సినీ అభిమానులను అలరించిన శ్రీదేవి ఇప్పుడు సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టి నిరాశలోకి నెట్టింది. కొన్నేళ్లకు బాలీవుడ్ ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిందని భావించిన అభిమానులకు ఆ తర్వాత మళ్లీ నిరాశకు గురి చేసింది. మళ్లీ ఒక్క సినిమాలో నటించలేదు. అయితే ఈసారి తనకు బదులు తన కూతురిని సినిమాలోకి తీసుకువచ్చింది. తన కూతుళ్ల సినీ ఎంట్రీ గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నా ఆమె ఏనాడూ స్పందించలేదు. పైగా ఆమె తనకు జీవితాన్ని ఇచ్చిన తెలుగు పరిశ్రమలోనే తన కూతుళ్లను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తారని సమాచారం వచ్చింది. కానీ అవి పుకార్లే అని తేలాయి.
చివరికి ఓ బాలీవుడ్ సినిమాతో తన పెద్ద కూతురు జాహ్నవిని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తోంది. జాహ్నవి నటిస్తున్న చిత్రం దడఖ్ ఫస్ట్లుక్ను చిత్రబృందం విడుదల చేసింది. ఆ చిత్రంతో లోకానికి తెలిసింది శ్రీదేవి కూతురు సినీ పరిశ్రమలోకి వస్తోందని. మరాఠిలో సంచలనాత్మక విజయం సాధించి రూ.వంద కోట్లను క్రాస్ చేసిన సైరత్ సినిమాను దఢఖ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇక జాహ్నవి సరసన ఇషాన్ ఖటర్ హీరోగా నటిస్తున్నాడు. ఫస్ట్లుక్లో జాహ్నవి చాలా సింపుల్గా కనిపిస్తోంది. హీరో కూడా కొంచెం డీసెంట్ గానే కనిపిస్తున్నాడు.