Saturday, May 11, 2024
- Advertisement -

శ్రీదేవి చ‌నిపోయి అప్పుడే ఏడాది అవుతోందా..?

- Advertisement -

అతిలోక సుంద‌రి శ్రీదేవి మ‌ర‌ణించి అప్పుడే సంవ‌త్స‌రం అవుతోంది. గ‌త ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్ హోట‌ల్లో ప్ర‌మాదంలో మ‌ర‌ణించింది శ్రీదేవి. బంధువుల పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి,అక్క‌డ బాత్ ట‌బ్‌లో ప‌డి మ‌ర‌ణించింది. శ్రీదేవి మ‌ర‌ణ‌వార్త‌ను విని ఆమె అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. ఆమె మ‌ర‌ణించి అప్పుడే సంవ‌త్స‌రం కావ‌స్తోంది అంటే ఎవ‌రికి న‌మ్మ బుద్ధికావ‌డం లేదు. శ్రీదేవి ప్రథమ వర్ధంతిని జరపడానికి వారి కుటుంబ స‌భ్యులు స‌న్నాహాలు చేస్తున్నారు.

మొద‌ట ఆమె ప్రథమ వర్ధంతిని ముంబైలో జ‌రుపుదామ‌ని అనుకున్న‌ప్ప‌టికి ,శ్రీదేవికి చెన్నై న‌గ‌రం అంటే మ‌మాకారం ఎక్కువ‌ని తెలిసి ఈ కార్య‌క్ర‌మాన్ని అక్క‌డికి మార్చారు. ఆమె ఖాళీ స‌మ‌యంలో ఎక్కువుగా చెన్నై న‌గ‌రానికి వ‌చ్చి ఉండేవార‌ట‌.చెన్నైలో శ్రీదేవికి సొంత ఇల్లు కూడా ఉంద‌ని తెలుస్తోంది. దీని కార‌ణంగానే శ్రీదేవి ప్రథమ వర్ధంతిని చెన్నై నగరంలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట భ‌ర్త బోనీ క‌పూర్‌. అక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలో శ్రీదేవి కుటుంబ సభ్యులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్టు చెబుతున్నారు.

శ్రీదేవి తెలుగు సినిమాల‌లో బాలన‌టిగా ఎంట్రీ ఇచ్చారు. త‌రువాత కాలంలో తెలుగు,త‌మిళ‌,హిందీ భాష‌ల‌లో హీరోయిన్‌గా న‌టించిన అతిలోక సుంద‌రిగా పేరు తెచ్చుకుంది. అప్ప‌ట్లో ఆమె అందానికి ఫిదా కానివారు ఉండేవారు కాద‌ట‌. శ్రీదేవి మ‌ర‌ణం త‌రువాత ఆమె పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ ద‌ఢ‌క్ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -