శ్రీదేవి మరణవార్త విన్న తరువాత ఆమెతో ఉన్న అనుభావలను అందరు గుర్తు చేసుకుంటున్నారు.ఈ సందర్భంలోనే సూపర్స్టార్ రజనీకాంత్ కూడా శ్రీదేవితో తనకు ఉన్నా అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.శ్రీదేవి తమిళంలో 16 వయాతినలే మూవీలో చేశారు.తన అద్భుతమైన నటనతో సినిమాకు ప్రాణం పోశారు శ్రీదేవి. ఈ సినిమాలో ఓ సీన్ గురించి రజనీకాంత్ ప్రస్తావించారు.శ్రీదేవి ఓ సన్నివేశంలో రజనీపై ఉమ్మి వేయాల్సిన సందర్భం. అయితే ఈ సీన్ కోసం చాలా సమయం పట్టిందట. రీటేక్లు తీసుకున్నా సీన్ పర్ఫెక్ట్గా రాలేదు. డైరెక్టర్ కూడా సంతృప్తి చెందలేదు.
ఇక చేసేది ఏం లేక రజనీ శ్రీదేవి దగ్గరికి వెళ్లి నిజంగానే తన మొహం మీద ఉమ్ము వేయమని కోరాడు అంటా.దీనికి శ్రీదేవి నిరాకరించి నేను అలా చేయను అనేసింది ..కాని రజనీకాంత్ రిక్వెస్ట్ చెయ్యడంతో పాటు మీరు అలా చేస్తేనే సీన్ పర్ఫెక్ట్గా వస్తుందన్నారట.తరువాత శ్రీదేవి నిజంగానే రజనీపై ఉమ్ము వేశారు.ఈ విధాంగా శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రజనీకాంత్.