నటి శ్రీదేవి మరణంతో యావత్ సీనీ లోకం మొత్తం శోకసంద్రంలో మునిగింది.బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే హోటల్ గదిలో ప్రాణాలు వదిలారు.ఆమె బాత్టబ్లో పడిపోయి, స్పృహ కోల్పోవడం వల్లే చనిపోయారని దుబాయ్ అధికారులు తేల్చారు.శనివారం చనిపోయిన ఆమె మంగళవారం రాత్రికి ఆమె భౌతిక కాయాన్ని ప్రయివేట్ జెట్లో ముంబై తీసుకొచ్చారు.అయితే ఇక్కడ విషయం ఏమిటంటే …ఆమెను తీసుకువచ్చిన జెట్ విమానం అనిల్ అంబానీది అంటా.ఈ విమానాన్ని ఆయనే స్వయంగా సమకుర్చరాని సమాచారం.
శ్రీదేవి భౌతికకాయం తరలింపు కోసం అనిల్ అంబానీ తన జెట్ను సమకూర్చడానికి ముఖ్య కారణం ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటమే.బోనీ కపూర్ సోదరి రీనా మార్వా కుమారుడైన మోహిత్అం,అంతరా మోతివాలాను పెళ్లాడారు. అంతర అనిల్ అంబానీ భార్య టీనాకు స్వయానా అక్క కూతురు. వీరి పెళ్లితో అంబానీలకు బోనీ కపూర్ ఫ్యామిలీతో దగ్గరి సంబంధం ఏర్పడింది. శ్రీదేవి పార్థీవ దేహాన్ని దుబాయ్ నుంచి ముంబై తీసుకు రావడానికి అనిల్ అంబానీ తన జెట్ను సమకూర్చడానికి ఇది కూడా ఓ కారణమే.