తెలుగు ప్రేక్షకులు అతిలోక సుందరిగా శ్రీదేవిని ఆరాధించారు. టాలీవుడ్ తో ఆమెకు కూడా అంతే అనుబంధం ఉంది. శ్రీదేవి తన కుమార్తె జాన్వీ కపూర్ ను తెలుగు సినీ రంగం నుంచే అరంగేంట్రం చేయించాలను కున్నారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. శ్రీదేవి మరణానంతరం జాన్వీ హిందీ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు.
తాజాగా జాన్వీ కపూర్ పేరు మరోసారి టాలీవుడ్ లో వినిపిస్తున్నది. ఆమె త్వరలోనే తెలుగు తెరపై కనువిందు చేయనున్నారని టాక్. కొందరు నిర్మాతలు ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న నేపథ్యంలో జాన్వీ కూడా పలు సందర్భాల్లో తెలుగు పరిశ్రమపై అభిమానాన్ని బయటపెట్టారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లతో తెలుగు సినిమా రేంజే మారిపోయింది కూడా. కాగా జాన్వీ కపూర్ సైతం తెలుగు సినిమాలో చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. లైగర్ సినిమా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో నటించనున్న చిత్రం, తర్వాత ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో జాన్వీని తీసుకునేందుకు నిర్మతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే జాన్వీ తెలుగులో అరంగేట్రం చేయనున్నారన్న మాట.
మంచి పని చేయబోతే.. రాజమౌళికి ఎదురైన ట్రోల్స్