Monday, May 6, 2024
- Advertisement -

శ‌ర్వానంద్‌ను లైన్లో పెట్టిన‌ శ్రీకాంత్ అడ్డాల‌

- Advertisement -

కొత్త బంగారు లోకం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచియ‌మైయ్యాడు శ్రీకాంత్ అడ్డాల.రెండో సినిమానే మ‌హేశ్ ,వెంక‌టేశ్ వంటి న‌టులతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను తెర‌కెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ తరువాత ఆయన మహేశ్ బాబుతో చేసిన ‘బ్రహ్మోత్సవం’ పరాజయంపాలు కావడంతో శ్రీకాంత్ అడ్డాలతో సినిమాలు చేయ‌డానికి ఎవ‌రు ముందుకు రాలేదు.ఆయన ఇటీవల అల్లు అరవింద్ ను కలిసి ఒక కథ చెప్పాడట.

కథ కొత్తగా ఉండటం వలన తమ బ్యానర్లో ఆ సినిమా చేయడానికి అల్లు అరవింద్ అంగీకరించాడని అంటున్నారు. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ చేయనున్నట్టు తెలుస్తోంది. దసరాకి ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనిపై పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తార‌ని సినిమా యూనిట్ తెలిపింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -