Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్, చరణ్ దెబ్బ……. జక్కన్న ప్లానింగ్ మొత్తం ఛేంజ్ అయిపోయిందిగా

- Advertisement -

రాజమౌళి కెరీర్‌లో ఇప్పటికే ఇలాంటివి చాలా సార్లు జరిగాయి. ఆయనేదో ప్లాన్ చేస్తాడు. ఇంకేదో జరుగుతుంది. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అయింది. అంతా కూడా ఎన్టీఆర్-రామ్ చరణ్‌ల మహత్యం. మర్యాద రామన్న సినిమాను కూడా చాలా తక్కువలో తీయాలనుకున్నాడు రాజమౌళి. అలాగే ఈగ సినిమాను అత్యంత తక్కువ బడ్జెట్‌లో ప్లాన్ చేశాడు. కానీ పరిస్థితులన్నీ మారిపోయి భారీ సినిమాలు అయిపోయాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. బాహుబలి సిరీస్ తర్వాత గ్రాఫిక్స్, భారీతనం లేకుండా గుండమ్మ కథలాంటి సినిమా తీయాలనుకున్నాడు జక్కన్న. కానీ పరిస్థితులు అన్నీ మారిపోయాయి.

ఎన్టీఆర్, చరణ్‌లు ఇద్దరూ కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేద్దామని జక్కన్నను ఒప్పించారు. ఆ తర్వాత బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ కథ అనుకున్నారు. ఇఫ్పుడు ఆ కథలో కూడా మార్పు వచ్చింది అని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సారి కూడా గ్రాఫిక్స్ భారీగానే ఉండబోతున్నాయట. గరుడవేగ స్టైల్‌లో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. అల్ట్రా మోడరన్ స్టైల్, అర్బన్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో రాబోతున్నాడు. బడ్జెట్ కూడా 200 కోట్లు మించి ఉంటుందట. కాకపోతే కథ మాత్రం అన్ని భాషల ప్రేక్షకులకూ నచ్చేలా ఉంటుందట. మరీ ముఖ్యంగా హిందీ మార్కెట్‌ని టార్గెట్ చేసి ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్ ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. అందుకే ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా 2020కి మారిపోయింది. ముందు ముందు ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -