Saturday, April 27, 2024
- Advertisement -

బాహుబలి-3పై క్రేజీ అప్‌డేట్

- Advertisement -

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన చిత్రం బాహుబలి. పార్ట్-1, పార్ట్-2 కలెక్షన్ల పరంగా సృష్టించిన సునామీ ఏంటో చూశాం. ప్రభాస్‌ను పాన్ ఇండియా హీరోగా మార్చిన ఈ చిత్రం..రాజమౌళిని మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల జారితాలో చేర్చింది. నటి అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అనేక రికార్డులు సృష్టించింది. దాంతో పార్ట్3 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూశారు.

రాధేశ్యామ్ ప్రమోషన్స్‌ సందర్భంగా కొందరు బాహుబలి పార్ట్-3 వస్తుందా అంటూ ప్రభాస్‌ను నేరుగా అడిగేశారు. దానికి బాహుబలి స్టార్..హింట్ ఇచ్చాడు. బాహుబలి -3 గురించి తనకు కూడా ఎలాంటి న్యూస్ లేదనీ.. కానీ టైం వస్తే..ఏదైనా జరగొచ్చంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా బాహుబలి-3 పై రాజమౌళి నుంచి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. బాహుబలి పార్ట్ వన్, పార్ట్ 2 విడుదలై హిట్ అందుకున్నాయి. బాహుబలి పార్ట్-౩ చిత్రాన్ని మీ నుంచి ఆశించొచ్చా అంటూ యాంకర్ ప్రశ్నించారు. దానికి జక్కన్న స్పందించారు. తప్పకుండా ఆశించవచ్చన్నారు.

బాహుబలి చుట్టూ తిరిగే ఇతర కథలను ఆధారం చేసుకుని మూడో పార్టీ తీయబోతున్నట్లు తేల్చి చెప్పారు. ఈ విషయంలో నిర్మాత శోభు యార్లగడ్డ పాజిటివ్ గా ఉన్నారన్నారు. దీనిపై వర్క్‌ అవుట్ చేస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. అయితే ఇందుకు కొంచం సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌తో రాజమౌళి బిజీగా ఉన్నారు. దీని తర్వాత మహేశ్ బాబుతో ఆయన సినిమా తీయబోతున్నారు.

టాలీవుడ్ హీరోల గురించి బయటపెట్టిన పూనమ్.. ఎవరు ఎలాంటి వారంటే ?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రముఖ రచయిత..

మహేశ్‌కు విలన్‌గా విక్రమ్… మ్యాజిక్ చేయబోతున్న త్రివిక్రమ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -