Saturday, April 27, 2024
- Advertisement -

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రముఖ రచయిత..

- Advertisement -

పరుచూరి బ్రదర్స్ .. టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. నటులుగా రచయితలుగా అనేక సూపర్ హిట్ చిత్రాలకు పని చేశారీ సోదర ధ్వయం. వీరిలో పెద్ద వారైన పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఉన్నది పరుచూరి వెంకటేశ్వరరావేనా అని చాలా మంది షాక్ కు గురవుతున్నారు. ఆయన ఇంతలా గుర్తు పట్టకుండా మారిపోయారేంటని కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన పూర్తిగా చిక్కిపోయి కనిపిస్తున్నారు.

పరుచూరిని ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ ఇటీవల కలిశారు. ఈ సందర్భంగా ఫోటో దిగారు. దాన్ని సోష|ల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. తాను గురూజీని కలిశాననీ వృద్ధాప్యంలో ఉన్న ఆయన్ను చూసి కొంచెం బాధ కలిగిందనీ.. అయితే ఇప్పటికీ ఆయన మైండ్ చురుగ్గా ఉందన్నారు జయంత్ సి.పరాన్జీ. పరచూరి సోదరులు 300 పైచిలుకు చిత్రాలకు రచయితలుగా పనిచేశారు.

ఇందులో 200 పైగా చిత్రాలు బ్లాక్బస్టర్గా నిలిచాయి. ఇదొక గొప్ప అచీవ్మెంట్. లవ్యూ సార్…అంటూ జయంత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టు చేశారు. పరచూరి వెంకటేశ్వరరావు వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పంజా తదితర చిత్రాల్లో నటించారు. కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు బక్కచిక్కిపోయిన ఆయన ఫోటో బయటకు రావడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

సమంత, నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -