Thursday, March 28, 2024
- Advertisement -

చిత్ర బృందానికి అల్టిమేటం జారీ చేసిన రాజమౌళి

- Advertisement -

‘బాహుబలి’ సినిమా తర్వాత దర్శక ధీరుడు జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తన కుటుంబంతో ఆఫ్రికా అడవుల్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా నుంచి రామ్ చరణ్ తిరిగి వచ్చిన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇంతకు ముందు ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది ఆఖరుకల్లా పూర్తి చేయాలని రాజమౌళి అనుకున్నారు. కానీపరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో లో రాజమౌళి షూటింగ్ పనులను వేగవంతం చేయాలని అనుకుంటున్నారట. చిత్ర బృందానికి కూడా ఆలస్యం చేయకుండా షూటింగ్ కొనసాగించాలని చెబుతున్నారట. ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ అహ్మదాబాద్లో జరగనుంది. రామ్ చరణ్ సరసన నటించబోతున్న అలియా భట్ ఈ షూటింగ్ షెడ్యూల్ లో పాల్గోనబోతోంది. అయితే ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. 350 కోట్ల బడ్జెట్తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -