జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్టార్ హీరో అల్లు అర్జున్ మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేశారు.ఎప్పుడు మంచి పనులను చేస్తూ అభిమానులకు మార్గదర్శిగా ఉండే అల్లు అర్జున్ నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటుతూ ఈ పని తన హార్ట్ కి చాలా దగ్గరగా ఉందని. నేచర్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.
ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటూ పర్యావరణాన్ని రక్షించండి అప్పుడే రేపటి తరానికి ఒక మంచి వాతావరణాన్ని వరంగా ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు.ఎకో ఫ్రెండ్లీ గా ఉండడం అలవాటు చేసుకొని ప్రకృతి మనకిచ్చిన ఈ వరాన్ని ఎంతో జాగ్రత్తగా రేపటి తరానికి అందివ్వాలని తెలిపారు.
Also read:అలాంటి వార్తలు నమ్మకండి.. మా ఆయన ఆ పని చెయ్యట్లేదు!
ఈ సందర్భంగా అల్లు అర్జున్ #GoGreenWithAA అనే హ్యాష్ట్యాగ్తో మొక్కలు నాటాలని.. వాళ్లందరి వీడియోలు కూడా తాను సోషల్ మీడియాలో రీ పోస్ట్ చేస్తానని తెలియజేశారు.ఇక సినిమా విషయానికొస్తే అల్లు అర్జున్ స్థాయిలు సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటించనున్నారు.