Friday, May 17, 2024
- Advertisement -

రంగు రంగుల మొక్కలు.. మధ్యలో గంజాయి వనం..!

- Advertisement -

కర్ణాటక బెంగళూరులోని ఆర్​టీనగర్​కు చెందిన కీర్తి చక్రవర్తి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత కాలంగా ఇంటిపై కప్పుపై గంజాయిని పెంచుతున్నట్లు తెలిపారు. నిందితుని నుంచి మొత్తం 200 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.మొదటి నుంచి గంజాయికి బానిసైన కీర్తి చక్రవర్తి.. భార్య, పిల్లల్ని వదిలి ఒంటరి జీవితానికి అలవాటుపడ్డాడని పోలీసులు చెప్పుకొచ్చారు.

లాక్​డౌన్​ సమయంలో చక్రవర్తికి గంజాయి కొట్టడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆయనే స్వతహాగా ఇంటి పైకప్పుపై గంజాయి మొక్కలు పెంచడం ప్రారంభించాడు. రకరకాల పూల చెట్ల మధ్యలోనే.. గంజాయి మొక్కలను పెంచాడు. అవసరమైనప్పుడల్లా వాటిని వినియోగించుకునేవాడు.

ఓ రోజు తన సోదరుని కుమారుడు ఇంటికి రాగా.. చక్రవర్తి అతడిని కూడా గంజాయి తీసుకోవాలని పట్టుపట్టాడు. దీంతో విసుగు చెందిన ఆయన.. హెబ్బాల్​ పోలీసులకు సమాచారం అందించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -