రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమా సూపర్ హిట్ టాక్తో నడుస్తుంది.ఈ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ నటనకి ఆయన అభిమానులతో పాటు టాలీవుడ్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారు.సినిమాలో చిట్టిబాబులా రాచరణ్ తప్ప ఎవరు చేయలేరని ఎన్టీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ ట్వీట్కు స్పందించిన హీరో రామ్ చరణ్ ‘థ్యాంక్యూ బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చాడు.డైరక్టర్ సుకుమార్ను కుడా పొడిగేశాడు.తనకు నాన్నకు ప్రేమతో లాంటి హిట్ ఇచ్చిన సుక్కు మరో సూపర్ హిట్ సినిమా తీసినందకు ఆనందంగా ఉంది అని ట్వీట్ చేశాడు.
దీనికి స్పందించిన సుకుమార్ రంగస్ధలం టైమ్లో తీసుకున్న ఓ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో రాంచరణ్,ఎన్టీఆర్ మధ్యలో సుకుమార్ ఉన్నాడు.రాజమౌళి కుడా అదే విధాంగా ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే …ఆ ఫోటో ఎంత సంచలనంగా మారిందో మనందరికి తెలిసిందే.ఆ ఫోటో నుండి వచ్చిందే మెగా-నందమూరి మల్టీస్టారర్ సినిమా. ఇప్పడు సేమ్ టు సేమ్ అలానే ఓ ఫోటోను రిలీజ్ చేశాడు డైరక్టర్ సుకుమార్.టాలీవుడ్లో మోస్ట్ టాలెంట్ దర్శకులలో రాజమౌళి తరువాత స్థానం కచ్చితంగా సుకుమార్దే అనే నమ్మేవారి సంఖ్య ఎక్కువుగానే ఉంది.ఈ ఫోటో కారణంగా మరో మల్టీస్టారర్ రావచ్చు ఏమో చూద్దాం!