Saturday, April 27, 2024
- Advertisement -

సుకుమార్ అప్పుడు రంగంలో కి రావచ్చు

- Advertisement -

వినూత్న కథ తో తెరకి ఎక్కినా కుమారి 21 f సినిమా ని ప్రొడ్యూస్ చేస్తున్న సుకుమార్ ఇప్పుడు ప్రమోషన్ లు కూడా ఈ సినిమా కి వినూత్నం గా చెయ్యబోతున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ చేతుల మీదగా విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా, ఈ కొత్త సినిమా ఆడియో ని అక్టోబర్ 24  న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు మనకి అందుతున్న విశ్వసనీయ సమాచారం.దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇవాళ రావచ్చు.

దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమా కి హై లైట్ కాబోతోంది అని సినిమా వర్గాలు మనకి సమాచారం ఇస్తున్నాయి.

ఈ మధ్య కాలం లో వరస హిట్ లు అందుకుంటున్న రాజ్ తరుణ్ ఈ సినిమా లో హీరోగా నటిస్తున్నాడు. హీబా పటేల్ అనే కొత్త అమ్మాయి ని సుకుమార్ తన స్టైల్ లో హీరోయిన్ గా ఇంట్రోడ్యూస్ చెయ్యబోతున్నాడు.

అక్టోబర్ 24 న ఆడియో నీ 30 న సినిమా నీ విడుదల చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ లు చేస్తున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదగా ఆడియో విడుదల అవబోతోంది, ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా చెయ్యబోతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -