అక్కినేని మనమడుగా తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సుమంత్ ఎందుకనో అనుకున్నంత సక్సెస్ కాలేదు.చాలా గ్యాప్ తరువాత ఈ మధ్య మళ్లీ సినిమాలు మొదలు పెట్టిన సుమంత్కు మళ్లీ రావా సినిమా మంచి విజయాన్నిందించింది.తాజాగా సుమంత్ హీరోగా ‘సుబ్రహ్మణ్యపురం అనే నటిస్తున్నాడు.సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా ఈషా రెబ్బ నటిస్తుంది.తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.హేతుబద్ధంగా పురాతన ఆలయాలపై రీసెర్చ్ చేసే వ్యక్తి పాత్రలో సుమంత్ కనిపించనున్నారు.
ఇప్పటికే సినిమా పోస్టర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసిన చిత్రబృందం టీజర్ తో అంచనాలను మరింతగా పెంచేసింది.ఒక ఊరిలో వరుసగా జరిగే హత్యలు ఎవరికి అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు వీటిపై ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ణయించుకునే హీరో.. ఇలా టీజర్ ని ఆసక్తికరంగా కట్ చేశారు. ‘ఎదురొస్తే ఏం చేస్తాడండీ.. మీ దేవుడు’ అని సుమంత్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.