Tuesday, May 28, 2024
- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ చేసిన ప‌నికి ఏడ్చేశాను : అక్కినేని సుప్రియ

- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌టి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరోయిన్ అక్కినేని నాగ‌ర్జున మేన కోడ‌లు సుప్రియ అన్న సంగ‌తి తెలిసిందే.ఆ సినిమా త‌రువాత మ‌ళ్లీ ఇన్నాళ్లుకు గూఢ‌చారి మూవీలో క‌నిపించింది సుప్రియ‌.తాజాగా ఆమె క‌మెడియ‌న్ ఆలీ నిర్వ‌హించే ఓ షోకి ముఖ్య అతిథిగా వ‌చ్చారు.ఈ సంద‌ర్భంగా ఆమె త‌న జీవిత విశేషాలు గురించి చెప్పుకొచ్చింది.త‌న మొద‌టి సినిమా విష‌యాల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకుంది సుప్రియ‌.పవన్ కళ్యాణ్ తెగ సిగ్గుపడిపోతు ఉండేవారు.సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో ఇండస్ట్రీలో స్ట్రైక్ జరుగుతోంది.

దీంతో టెక్నీషియన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండేవారు. మొదటి సినిమా కావడంతో పవన్ చాలా టెన్షన్ తీసుకునేవారు. నాకు మాత్రం ఏం అనిపించేది కాదు. సినిమా షూటింగ్ లో ఆయన తన చేతులపై కార్లు ఎక్కించుకొని, ఛాతీపై రాళ్లు పగలగొట్టించుకొని శ్రమ తీసుకున్నారు. మొదట డూప్ ని పెడతారేమో అనుకున్నాను. కానీ పవన్ నిజంగానే కార్లు చేతిపై ఎక్కించుకోవడం చూసి నాకు ఏడుపు ఆగలేదు.ప‌వ‌న్ జెంటిల్మెన్, చాలా మంచి వార‌ని తెలిపింది సుప్రియ‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -