Monday, April 29, 2024
- Advertisement -

ఈ చిత్రానికి టర్నింగ్ పాయింట్ పేరే

- Advertisement -

24 చిత్రానికి త్వరలోనే ప్రీక్వెల్ తీస్తామని ఆ చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పారు. ఈ చిత్రం చిన్న పిల్లలకు ఎంతో నచ్చిందని, వారి నుంచి తమకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయని ఆయన అన్నారు. చిత్రంలో 24 అనేది ఓ టర్నింగ్ పాయింట్ అని, అందుకే చిత్రానికి ఆ పేరే పెట్టామని విక్రమ్ కుమార్ చెబుతున్నారు.

మనం చిత్రాన్ని తమిళంలో తీసేందుకు సూర్య తనను పిలిచారని, అయితే రీమేక్ లు తీసేంుదుకు తాను ఇష్టపడనని విక్రమ్ కుమార్ చెప్పారు. ఆలోచనలు, కథ, తీసే పద్దతి అన్నీ కొత్తగా ఉండాలి. అందుకే సూర్యకి 24 కథ చెప్పా. ఆయనే ఆత్రేయ పాత్ర చేయాలని కోరగానే సూర్య చాలా ఎగ్జైట్ అయ్యారు. విలన్ పాత్ర చేసేందుకు హీరోలు ముందుకు రారు.

కాని సూర్య మాత్రం సరే అన్నారు. కథ, కథనం సూర్యకు నచ్చడంతో నిర్మాతగా తానే చిత్రాన్ని తీసేందుకు ముందుకు వచ్చారు. ఈ సినిమాలో లాజిక్ గురించి ఆలోచించకూడదు. ఇది మ్యాజిక్ చిత్రం. ఫాంటసీ చిత్రం. అలా అనుకుని థియేటర్ కి వస్తే వంద శాతం ఎంటర్ టైన్ అవుతారు అని విక్రమ్ కుమార్ చెప్పారు. ఈ చిత్రం ఇచ్చిన హిట్ తో దీనికి ప్రీక్వెల్ తీయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -