Friday, May 3, 2024
- Advertisement -

డిసెంబర్‌లో ‘మేము’ సినిమా విడుదల

- Advertisement -

సూర్య, అమలాపాల్‌, బిందుమాధవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తమిళ చిత్రం ‘పసంగ`2’. ఈ చిత్రాన్ని తెలుగులో  ‘మేము’ పేరుతో అనువాదమవుతుంది.  సినిమా కథ నచ్చడంతో స్వయంగా సూర్య మరియు కే.ఐ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి  నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తెలుగు లో కూడా మంచి క్రేజ్ వస్తుంది.

ఈ సినిమాని డిసెంబర్‌ 4న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు పాండిరాజ్‌ చేసిన అన్ని సినిమాలు విజయం సొంతం చేసుకున్నవే అదే కోవలో ఈ సినిమా కూడా విజయం సొంతం చేసుకుంటుంది అని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -