Thursday, May 2, 2024
- Advertisement -

అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘ స్తెరా ‘ రొమాన్స్.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకుడిగా రామ్ చరణ్ నిర్మాణ సారధ్యం లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా కి సంబంధించిన కొత్త షెడ్యూల్ పనులు జరుగుతున్నాయి.

ఇప్పటికే చాలా షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం చిత్రం లో ఓక ముఖ్యమైన పాటను చిత్రీకరించే పనుల్లో వున్నారు. దానికి సంబధించి ఒక స్పెషల్ సెట్ నీ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసినట్టు తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం లో ఈ పాట ఉండబోతోంది అని సమాచారం. కృత్రిమ జలపాతాలు మరియు పూల మధ్య ఈ కొత్త పాటను చిత్రీకరించనున్నారు ఫిలిమ్ యూనిట్. అలాగే ఈ సినిమాకి ఈ పాట ప్రధాన ఆకర్షణ అని చిత్ర వర్గాలు చెప్తున్నారు. ఈ పాట షూటింగ్ పూర్తి అవ్వగానే చిత్రం లోని ముఖ్య సన్నివేశాల కోసం మరొక్క కొత్త షెడ్యూల్ మొదలవబోతుంది. త్వరలో కోకాపేట లో ఈ కొత్త షెడ్యూల్ మొదలుకానున్నది. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ, తమన్నా మొదలగు వారు ఈ సినిమా లో నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -