రామ్చరణ్ ‘రంగస్థలం’లో పూజాహెగ్డే ఐటమ్ జిగేలు రాణి అని సందడి చేసింది. ఇప్పుడు రామ్చరణ్ మరో హీరోయిన్ ఐటం పాట చేయడానికి సిద్ధమవుతోంది. దానికోసం ఇప్పుడు కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది. ఇటీవల యోగా ఫొటోలతో కనిపించిన తమన్నా.. ఆ కసరత్తు అంతా చరణ్తో పాటేసుకోవడానికి తెలుస్తోంది.
‘రంగస్థలం’తో కెరీర్లోనే బెస్ట్ హిట్ కొట్టిన చరణ్ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసే సినిమా కోసం బిజీ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని సన్నివేశాలు తీశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో దానయ్య నిర్మాతగా రూపొందిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.
బోయపాటి అంటే మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ భారీగా ఉంటాయి. ఈ సినిమాలో ఐటమ్ పాట ప్రత్యేకంగా రూపొందిస్తున్నారని సమాచారం. ఆ పాటకు తమన్నాను ఎంపిక చేసి నటింపజేయాలని చిత్రబృందం ప్లాన్. ఈ మాస్ మసాలా ఐటం సాంగ్లో తమన్నా మెరవబోతోందని టాక్.
ఐటం సాంగ్స్ చేయడం కూడా తమన్నాకు కొత్త కాదు. గతంలో ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’, ‘జాగ్వార్’ సినిమాలతోపాటు ఇటీవల ‘జై లవకుశ’లో సినిమాలో ఎన్టీఆర్తో కలిసి స్వింగ్ జర స్వింగ్ జర అంటూ ఊపేసిన తమన్నా ఇప్పుడు చెర్రీతో కవ్వించడానికి వచ్చేయనుంది. గతంలో చరణ్తో చేసిన సినిమాలో ‘రచ్చ’లో వాన వాన వెల్లువాయే పాటలో అందాల ఆరబెట్టుకొని చెర్రీతో రసం పిండేలా చేసింది. ఇప్పుడు మళ్లీ అదే మాదిరి తమన్నా చేసే అవకాశం ఉంది.