సెలబ్రిటిల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి బహిరంగా మాత్రం ఏకవచనంతో పిలవరు. అయితే ఓ సందర్భంలో రామ్ చరణ్ కు అలాంటి సంఘటనే ఎదురైంది. హీరోయిన్ తమన్నా అందరి ముందే చరణ్ ను ఏకంగా ’రా’ అనేసి అందరికి షాక్ ఇచ్చింది. దాంతో ఇది హాట్ టాపిక్ అయింది. ఇంతకు తమన్నా ఎందుకు అలా చేసింది. విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ’సైరా నరసింహా రెడ్డి’.
సంచలన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రం థ్యాంక్యూ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రంలో తమన్నా మాట్లాడుతూ.. చరణ్ తో తనకు ఉన్న స్నేహం ఎలాంటిదో చెప్పుకొచ్చింది. ”నిన్ను నిర్మాతగా చూడాలా? హీరోగా చూడాలా? ఏం చెప్పాలి రా నీ గురించి” అనేసింది. వేధికపై ఉన్న చిరు ఉండగానే తమన్నా ఇలా అనేసిందంటే వీరిద్దరి మధ్య ఎంత మంచి స్నేహం ఉందో అర్దం చేసుకోవచ్చు. గతంలో చరణ్, తమన్నా రచ్చ సినిమాలో నటించారు.
ఇక సైరాలో తమన్నా పోషించిన లక్ష్మీ పాత్రకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. దాంతో తమన్నా ఫుల్ హ్యాపీలో ఉంది. చిరంజీవి సినిమాతో ఇలాంటి ప్రశంసలు రావడం తనకెంతో సంతోషమనిపించిందని తెలిపింది. చిరంజీవితో మళ్లీ మళ్లీ నటించాలనుందని ఈ సందర్బంగా తన మనసులోని మాటను బయటపెట్టింది తమన్నా.