సినిమా అంటే ఓ రంగుల ప్రపంచం.. అయితే ఆ రంగుల ప్రపంచం వెనుక కొంత మంది సినీ తారలు ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఈ విషయం అప్పుడప్పుడు సోషల్ మీడియాల్లో తెగ హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా కోలీవుడ్ వర్ధమాన నటి రాధ, తనను ఓ ఎస్ఐ పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ, విరుగంబాక్కం స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ‘సుందరం ట్రావెల్స్’ చిత్రంలో హీరోయిన్ గా పరిచయమైన రాధ, తన భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత శాలిగ్రామ్ లో తన కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది.
ఆర్కేపురం పోలీసు క్వార్టర్స్లో నివాసం ఉండే తిరువాన్మియూరు ఎస్ఐ వసంత్ రాజ్తో రాధకు ఓ సినిమా షూటింగ్ సందర్భంలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో ప్రేమ, పెళ్లికి దారి తీసింది. అయితే అప్పటికే వసంత్ రాజ్ కి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అప్పటి నుంచి వసంత్ రాజ్ నటి రాధతోనే ఎక్కువ గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో వసంత్రాజ్ భార్య గతంలోనే తిరువాన్మీయూరు సీఐకి ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలోనే రాధ ఆధార్ కార్డులో వసంత్రాజ్ను భర్తగా, తన కొడుక్కి తండ్రిగా పేర్కొంటూ మార్పులు చేయించింది. ఈ విషయం తెలుసుకున్న వసంత్ రాజ్ ఆమెతో గొడవపడ్డాడు. తర్వాత వసంత్ ఆమెను బెదరింపులకు గురిచేశాడు. దీంతో రాధ విరుగం బాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది.