Wednesday, May 1, 2024
- Advertisement -

ఈ యాంక‌ర్ల రెమ్యునరేషన్ తెలిస్తే క‌ళ్లు బైర్ల క‌మ్మ‌డం ఖాయం

- Advertisement -

తెలుగు టెలివిజ‌న్ రంగంలో నేటి యాంక‌ర్లు దూసుకుపోతున్నారు.ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకున్న యాంక‌ర్స్ త‌మ పారితోషికం విష‌యంలో అదే విధాంగా దూసుకుపోతున్నారు.సినిమా హీరోయిన్లుకు ఏమాత్రం తీసిపోని విధాంగా వీరు సంపాదిండం విశేషం.తాజాగా తెలుగు యాంక‌ర్స్ సంపాదిస్తున్న రెమ్యునరేషన్లు బ‌య‌టికి వ‌చ్చాయి.బుల్లితెర మీద ఎప్పుడు నుంచో సంద‌డి చేస్తున్న యాంక‌ర్ సుమ రెమ్యునరేషన్ విష‌యంలో కూడా ముందువ‌రుస‌లో ఉంది.

ఆమె ఒక్కో ఈవెంట్‌కు రెండున్నర నుండి మూడు లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలిసింది. భారీ సినిమా ఈవెంట్స్ అంటే ఈ నంబర్ ఇంకాస్తా పెరుగుతుందట. ఇక సుమ త‌రువాత చెప్పుకొవాల్సింది యాంక‌ర్ అన‌సూయ‌.పెళ్లి అయి ఇద్ద‌రు పిల్లలు ఉన్న‌ప్ప‌టికి త‌న హాట్ హాట్ అందాల‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది అనసూయ‌.అందాల ఆర‌బోతలాగే త‌న పారితోషికం కూడా ఎక్కువుగానే ఉంది.ఆమె ఒక్కో ఈవెంట్‌కి రూ.2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటుందట.ఇటు బుల్లితెరతో పాట వెండితెర మీద కూడా న‌టిస్తు రెండు చేతుల సంపాదిస్తుంది అన‌సూయ‌.సుమ,అన‌సూయల త‌రువాత ఆ రేంజ్‌లో హిట్ అయింది ర‌ష్మీ.

తెలుగు రాక‌పోయిన‌ప్ప‌టికి వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విజ‌యం సాధించింది ర‌ష్మీ. ఒక్కో షోకి ర‌ష్మీ లక్ష వరకు రెమ్యునరేషన్ దక్కుతుందట. యాంక‌ర్ శ్యామల‌,శ్రీముఖి వంటి వారు ఈవెంట్‌కు 50 వేల రూపాయల వరకు తీసుకుంటార‌ని స‌మాచారం.ఇలా వీరు త‌మ యాంక‌రింగ్‌తో ,సినిమాలలో న‌టించ‌డం ద్వారా రెండు చేతుల సంపాదిస్తు హీరోయిన్లుకు పోటీగా నిలుస్త‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -