భారీ అంచనాల మధ్య ప్రారంభం అయిన బిగ్బాస్ రెండవ సీజన్ రెండో వారం పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక బిగ్బాస్లో మొత్తం16 మంది కంటెస్టంట్లు కాగ ఇప్పటికే ఇద్దరు కంటెస్టంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఈ ఇద్దరు కూడా కామన్మ్యాన్సే కావడం విశేషం. ఇక షోలో చివరి వరకు ఉండాలంటే సోషల్ మీడియా ద్వారా వచ్చే ఓట్లు కీలకం. దీనిలో భాగంగానే బిగ్బాస్లోని కొందరు కంటెస్టంట్లు షోలోకి వచ్చే ముందే స్పెషల్గా సోషల్ మీడియాలో ఓ టీంను ఏర్పాటు చేసుకోని మరి వచ్చారని సమాచారం.
కొందరు వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మరి వారికి ఓట్లు వేసే విధాంగా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది. ఈ లిస్టులో తేజస్వి, యాంకర్ దీప్తి, అలానే దీప్తి సునయన ఉన్నారని సమాచారం. టైటిల్ ను గెలవడానికి ముందే ప్లాన్ చేసుకొని మరి హౌస్ లోకి అడుగుపెట్టారు ఈ ముగ్గురు. మరి ఈ ముగ్గురిలో చివరి వరకు ఎవరు ఉంటారో చూడాలి.