ఈ సమ్మర్కు ఎండలతో పాటు సినిమాలు మంచి హీట్ ఎక్కించనున్నాయి.ఒకటి కాదు రెండు కాదు ఏకాంగా వారనికే ఓ సినిమా వస్తుంది ఈ సమ్మర్లో.రామ్ చరణ్,నితిన్,నాని,మహేష్ ,రజనీకాంత్,బన్నీ ఇలా అగ్ర హీరోలు తమ సినిమాలను విడుదలకు రెడీ అవుతున్నారు.సమ్మర్ మొదట తన సినిమాతో షురు చేస్తున్నాడు రాంచరణ్.మార్చి 30న రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా రిలీజ్ అవుతోంది. సుకుమార్-చరణ్ ఫ్రెష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.రంగస్థలం విడుదలైన వారం రోజులకి నితిన్ ఛల్ మోహన్ రంగ సినిమా వస్తోంది. నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ అందించాడు.
నితిన్ వచ్చిన వారనికి నాని థియెటర్లలలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.ఏప్రిల్ 12 నాని సినిమా కృష్ణార్జున యుద్ధం కూడా వచ్చేస్తోంది. ఇందులో నానిది డ్యూయల్ రోల్. కృష్ణ, అర్జున్ అనే రెండు పాత్రలు పోషిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఏప్రిల్ 20 నుంచి పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.
మహేష్ నటిస్తున్న భరత్ అనే నేను సినిమా వస్తోంది. స్పైడర్ సినిమాతో మహేష్ డబుల్ డిజాస్టర్ ఇచ్చి ఉండొచ్చు కానీ, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్-కొరటాల చేస్తున్న సినిమాగా భరత్ అనే నేను ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి.మరో వారానికి ఏప్రిల్ 27 రజనీకాంత్ నటించిన కాలా సినిమా సిద్ధంగా ఉంది. మే 4 బన్నీ నటిస్తున్న నా పేరు సూర్య థియేటర్లలోకి రానుంది. ఈ మూవీతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. వీటితోపాటు చిన్న హీరోల సినిమాలు ఓ డజన్ వరుకు లైన్లో ఉన్నాయి.బాక్స్ఫిస్ దగ్గర ఏ సినిమా నిలబడుతందో చూడాలి.