పవర్స్టార్,జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అంత సీన్ లేదని తేల్చేశాయి టీవి రేటింగ్స్.మొన్న ఆ మధ్య జరిగిన గొడవలో టీవి9,టీవి5,మహాన్యూస్ ఇలా కొన్ని న్యూస్ ఛానెళ్ల మీద ఫైర్ అయ్యాడు పవన్ కల్యాణ్.టాలీవుడ్ని ఊపేసిని కాస్టింగ్ కౌచ్సై గళమెత్తిన నటి శ్రీరెడ్డి పవన్తో పాటు వాళ్ల అమ్మాగారిని కూడా అనరాని మాటలు అనేసింది.దీనిని టీవి9,టీవి5,మహాన్యూస్ పదే పదే ప్రసారం చేశాయి అనేది పవన్ వాదన. కొన్ని శక్తులు నాకు వ్యతిరేకంగా పనిచేయడానికి ఇలా కుట్ర పన్నుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
ఇక్కడితో ఆగకుండా ఈ న్యూస్ ఛానెళ్లని ఎవ్వరు చూడవద్దని తన అభిమానులకు పిలుపినిచ్చారు.దీంతో రెచ్చిపోయిన పవన్ అభిమానులు ఇక మీద ఈ న్యూస్ ఛానెళ్లను చూడమని ప్రతిజ్ఞ చేశారు. మరికొందరైతే ఏకంగా ఇళ్లలో కేబుల్స్ కూడా పీకించుకున్నారు. పవన్ అతని ఫ్యాన్స్ ఎంత హాంగామా చేసిన లాభం లేకపోయింది. పవన్ పిలుపునిచ్చిన తర్వాత ఏ ఛానెల్స్ అయితే చూడొద్దన్నాడో ఆ ఛానళ్లకు అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి.తన వ్యక్తిగత సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చలనుకున్న వ్యక్తి చెబితే ఎవరైనా వింటారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.అంత అమాయకులు లేరని బయట పబ్లిక్ ఎద్దేవ చేస్తున్నారు.