తెలుగు సీనియర్ నటుడు, నిర్మాత గిరిబాబు ఇటీవల ఓ వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.పవన్,చిరంజీవిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి నటించిన ‘కొదమసింహం’, గిరిబాబు తీసిన ‘ఇంద్రజిత్’ సినిమాల విషయంలో జరిగిన వివాదాస్పదన పరిణామాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కొదమసింహం, ఇంద్రజిత్ చిత్రాలు ఒకేసారి విడుదలకు సిద్ధమైన కౌబాయ్ సినిమాలు. ముందు ‘ఇంద్రజిత్’ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. తర్వాత నెల రోజులకు ‘కొదమసింహం’ మూవీ విడుదలవ్వాల్సి ఉంది. అయితే రాత్రికి రాత్రే ‘కొదమసింహం’ సినిమా రిలీజ్ ప్రకటించడం వివాదానికి దారి తీసిందన్నారు.
పవన్ కళ్యాణ్ గురించి గిరి బాబు …ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్తో సినిమా చేసే అవకాశం రాలేదు, అందుకు కారణం ఆ సినిమాల్లో నేను చేయాల్సిన పాత్రలు లేక పోవడమో? నాకు సూటయ్యే పాత్రలు లేకపోవడమో? అయి ఉంటుంది. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ కు ఇటీవల వెళ్లాను. మా మనవడు సినిమాపై అవగాహన కోసం ఆ సినిమాకు పని చేస్తున్నాడు.
జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ మంచి ఆశయాలు ఉన్న వ్యక్తి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగు దేశం పార్టీ గెలిచింది. త్వరలో జనసేన పార్టీని దించుతా అంటున్నాడు. ఏం జరుగబోతోంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. పవన్ రాజకీయాల్లో రానిస్తాడన్నారు. వెయిట్ అండ్ సీ అని కామెంట్ చేశారు గిరిబాబు.
ఈయన వ్యాఖ్యలు చూస్తె గిరిబాబు కుంటుంబం సభ్యులలో ఎవరో ఒకర్ని రాజకీయాల్లోకి…ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి తీసుకొచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అసరం లేదనుకోవాలి.