ఒకప్పటి హాట్ బ్యూటీ హీరోయిన్ ఛార్మి ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటూ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో కలిసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించించిన పూరి జగన్నాథ్, ఛార్మీలు ఈ బ్యానర్పై ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు.పూరి కనెక్ట్స్ బ్యానర్ వ్యవహారాలన్నీ ఛార్మీనే నిర్వహిస్తు ఛార్మీ ముంబైలో ఉన్నారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం పూరి కనెక్ట్స్ బ్యానర్పై విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
హీరోయిన్ ఛార్మి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో కెరీర్ కు సంబంధించిన విషయాలతో పాటు,తన పెట్ ఐటమ్ చేసే అల్లరిని ఎప్పటికప్పుడు పంచుకోవడం జరుగుతుంది. ఛార్మికి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం అని చాలాసార్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా రష్మిక మందాన బాలీవుడ్లో పలు క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ సినిమా షూటింగ్ విషయమై ముంబైకి వెళ్లిన రష్మిక ఛార్మిని ఓ సందర్భంలో కలిసింది.
Also read:ఈ నటుడి కథను సినిమా తీస్తే.. పక్క సూపర్ హిట్!
ఈ సందర్భంగా ఛార్మి రష్మికకు ఓ పెట్ను దత్తత ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని చార్మి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఐటమ్ని ఆరా కలిసినప్పుడు కంగ్రాట్స్ రష్మిక. మీ బిడ్డ ఎంతో బాగుంది. మా ముంబైకి స్వాగతం అని పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్కు రష్మిక స్పందిస్తూ.. థ్యాంక్యూ ఛార్మీ, ఇకపై ఎప్పుడూ నన్ను అక్కడే చూడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇంతకి ఐటమ్, ఆరా ఏంటి అనుకుంటున్నారా చార్మీ పెంపుడు కుక్క పేరు ఐటమ్, రష్మిక పెట్ పేరు ఆరా. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also read:రంగం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది?