బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న తెలుగు స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో మరోసారి సాహో సినిమాతో రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్దమవుతున్నారు. సుజిత్ దర్శకత్వంలో రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్గా సినిమా అభిమానులను షేక్ చేసేందుకు థియేటర్లలోకి దిగుతోంది. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ బిజీగా గడుపుతున్నారు.పలు భాషల్లో సినిమా విడుదల నేపధ్యంలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక కోలీవుడ్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో తమిళంలోనూ ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఈ క్రమంలో ఇంటర్వూల్లో ఈ క్రమంలోనూ ఓ తమిళ్ యాంకర్ ప్రభాస్ని ఏపీ సీఎం జగన్మోహర్ గురించి చెప్పాలని అడిగాడు.తనకు రాజకీయాలు అంతగా తెలియవని వ్యాఖ్యానించిన ప్రభాస్… ఏపీకి యంగ్ సీఎంగా ఉన్న జగన్ బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఆయన హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్టు ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వాన్ని నడిపిస్తాడనే నమ్మకం తనకు ఉన్నట్లు చెప్పారు. కొత్త రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలో కూడా జగన్కు తెలుసని ప్రభాస్ చెప్పాడు. ఏదేమైనా ఏపీ సీఎంపై ప్రభాస్ పాజిటివ్గా చేసిన ఈ వ్యాఖ్యుల ఇప్పుడు సంచలనంగా మారాయి. దీంతో వైసీపీ అభిమానులు ఖుషీ అవుతున్నారు.