ప్రస్తుతం ఏపిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోనా మహమ్మారిని సమూలంగా నియంత్రించే దిశగా ఆరోగ్య యజ్ఞం ప్రారంభించాలని, ఇందులో భాగంగా నెల రోజుల వ్యవధిలో కోటి మందికి వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.
గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మండల పరిధిలో వారంలో నాలుగు రోజుల పాటు, రోజుకు రెండు గ్రామాల్లో వ్యాక్సిన్ లను వేయాలని, తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి, లోపాలను గుర్తించి సరిదిద్దిన తరువాత విస్తృత స్థాయిలో టీకాలను ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని జగన్ ఆదేశించారు.
ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉందని సీఎం జగన్ అన్నారు. వ్యాక్సినేషన్ను ఉద్ధృతం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞం ముమ్మరంగా కొనసాగాలని సీఎం అధికారులకు సూచించారు.
సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రామ్ చరణ్!