- Advertisement -
దీపావళి సందర్భంగా టాలీవుడ్ సెలబ్రెటీలు విషెస్ చెప్పారు. సింగిల్ ఫ్రేమ్లో ఫ్యాన్స్ని కనువిందు చేశారు. పలువురుసెలబ్రిటీలైతే మరింతమందిని పిలిచి గ్రాండ్ పార్టీ చేసుకున్నారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లోకి వారసురాలు రావడంతో తొలిసారి వచ్చిన దీపావళిని గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు, ఫ్యామిలీలు, సెలబ్రిటీలు వచ్చారు. మహేష్ – నమ్రత దంపతులు, ఎన్టీఆర్- ప్రణతి, వెంకీ మామ, సుధీర్ బాబు ఫ్యామిలీ, మంచు లక్ష్మి సందడి చేశారు.
ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకీ మామ, మహేష్ బాబు ఉండగా ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. వీరితో పాటు పలువురు సెలబ్రెటీలు దీపావళి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇక ఒకే ఫ్రేమ్లో టాలీవుడ్ హీరోలు కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.