టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో చాలామంది అభిమానులను సంపాదించాడు.అందరి హీరోల అభిమానులు దేవిశ్రీ సంగీతాన్ని అభిమానిస్తుంటారు.మరి అలాంటి దేవిపై నెటిజన్లు మండిపడుతున్నారు.విషయంలోకి వెళ్తే రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాకు కూడా దేవినే సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా టీజర్ను నిన్ననే విడుదల చేశారు చిత్ర యూనిట్.టీజర్కు మంచి స్పందనే వస్తుంది.కాని ఈ సినిమాకి సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ ని మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
టీజర్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన స్కోర్ ఇదివరకే విన్నట్లు ఉందని నెటిజన్లు వాదిస్తున్నారు. కొందరు శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ సినిమాలకు అందించిన స్కోర్ లను కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘వినయ విధేయ రామ’ స్కోర్ కూడా అలానే ఉందంటూ దేవిపై విమర్శలు చేస్తున్నారు. ఆ సినిమాల మ్యూజిక్ కొంతవరకు మ్యాచ్ కావడంతో దేవిపై ట్రోలింగ్ ఆగడం లేదు.తన సినిమాల నుండే దేవిశ్రీప్రసాద్ కాపీ కొట్టాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దీనిపై దేవీ శ్రీ ప్రసాద్ ఎలా స్పందిస్తాడో చూడాలి.