- Advertisement -
తనకు రాష్ట్రస్థాయి పదవి ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని ఓ టీవీ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…టీవీ సీరియల్స్లో నటిస్తు మంచి పేరు సంపాదించిన సుశ్మితకు ఆదిశక్తి మహిళ సంఘం రాష్ట్రస్థాయి మహిళా అధ్యక్షరాలిగా నియమిస్తామంటూ నమ్మించి సుశ్మిత నుంచి వీరు రూ. 10 లక్షలు తీసుకున్నారు.రఘ చంద్రప్ప, సంగీత అనే ఇదరు తన వద్ద రూ. 10 లక్షలు నగదు తీసుకుని మోసం చేశారని బుల్లితెర నటి సుశ్మిత ఇటీవల అన్నపూర్ణేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోజులు గడుస్తున్నా కూడా నియామకం జరగక పోవడంతో పాటు నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ప్రాణాలు తీస్తామని వారు హెచ్చరించడంతో నటి సుశ్మిత ఇటీవల అన్నపూర్ణేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.సరోజ అనే మహిళ వద్ద కూడా వీరు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.