Saturday, May 18, 2024
- Advertisement -

ప్రేమ‌ను లాక్ చేసేసిన చెర్రీ దంప‌తులు

- Advertisement -

పెద్ద‌లు కుదిర్చిన + ప్రేమ‌ వివాహం.. ఇద్ద‌రు ప్ర‌ముఖ వ్య‌క్తులు. భార్య‌నేమో వ్యాపారంలో బిజీగా ఉండ‌గా.. భ‌ర్త‌నేమో వ‌రుస సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా కొన‌సాగుతున్నాడు. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటుంద‌ని అనుకుంటారు. కానీ వీరిద్ద‌రిదీ అన్యోన్య దాంప‌త్యం. వారే రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, ఉపాస‌న కామినేని. 2012లో వివాహం చేసుకొని ప్ర‌శాంతంగా కుటుంబ జీవితం గ‌డుపుతూ ఇటు సినిమాలు, వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. అయితే వీరిద్ద‌రూ ఎప్పుడూ ప్రేమ‌గా ఉంటార‌ని కొన్ని సంఘ‌ట‌న‌ల‌తో చెప్ప‌వ‌చ్చు.

దీనికి తాజాగా ల‌వ‌ర్స్ డే సంద‌ర్భంగా ఉపాస‌న కామినేని అభిమానుల‌తో ఓ విష‌యాన్ని పంచుకున్నారు. ప్రేమికుల రోజు నాడు చరణ్‌తో తన లవ్ ఫీలింగ్స్ మరోసారి బయట పెట్టుకుంది. మెగా కోడలు ఉపాసన కూడా తనదైన శైలిలో ట్విట్టర్‌లో భర్త రామ్‌చరణ్‌పై ఉన్న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచింది. చరణ్‌తో ఉపాసన వివిధ ప్రేమికుల పేర్ల మీద లాక్ చేసిన తాళాల గుత్తిలో వాటితో పాటు తమది కూడా జోడిస్తున్నాను అని చెబుతూ విషెస్ చెప్పింది. మా ప్రేమ‌ను శాశ్వతంగా లాక్ చేస్తున్నాను అని రెండు ఫొటోలు ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -