Tuesday, May 7, 2024
- Advertisement -

మళ్లీ అతనినే నమ్మనున్న మహేష్ బాబు

- Advertisement -

‘భరత్ అనే నేను’ నేను సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాతో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయినప్పటికి సినిమా అత్తెసరు మార్కులతో బయటపడింది. మరో వైపు మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాకి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి సినిమా చేస్తానని చెప్పటం అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. నిజానికి ‘మహర్షి’ సినిమా సరిగ్గా ఆడక పోవడానికి గల కారణాలలో వంశీ పైడిపల్లి కూడా ఒకరు. మహేష్ బాబు కెరీర్ లో మైలురాయి చిత్రం కాబట్టి సినిమా బిజినెస్ బాగా జరిగింది. కానీ వంశీ పైడిపల్లి సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టించడంతో కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెట్టుకు రాలేక పోయింది.

అలాంటిది వంశీ పైడిపల్లి ట్రాక్ రికార్డు తెలిసిన తరువాత కూడా మహేష్ బాబు మళ్లీ అతనితో పని చేయడం ఏమిటని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా మహేష్ బాబు వంశీ పైడిపల్లి తో సినిమా తీయాలని అనుకుంటే ‘సరిలేరు నీకెవ్వరు’ లాగా ఒక ఖచ్చితమైన బడ్జెట్ ఇవ్వటం ఉత్తమం అని కొందరు సలహా ఇస్తున్నారు. మరి మహేష్ బాబు నిజంగా వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడో లేదో తెలియాల్సి ఉంది. కానీ ‘మహర్షి’ సినిమా చూశాక మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాపై అభిమానులు కూడా అంతగా ఆసక్తి చూపరేమో అని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -