- Advertisement -
తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచియమైంది వరలక్ష్మీ.తన తండ్రి నటనను ప్రేరణగా తీసుకున్న వరలక్ష్మీ ఇప్పటికే తానేంటో నిరుపించుకుంది.పందెం కోడి-2,సర్కార్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది.అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతు ఇండస్ట్రీలో తన కెరీర్ ఇప్పుడే మొదలైందని మరో నాలుగు,ఐదు సంవత్సరాలు సినిమాలో నటిస్తానని చెప్పుకొచ్చింది.
సినిమాలు మానేసిన తరువాత ఏం చేస్తారని అడగ్గా రాజకీయలలోకి వస్తానంటోంది ఈ భామ.అయితే అప్పుడికి నా మనస్సులో వేరేలా ఆలోచిస్తే నేను ఏం చేయలేనని తెలిపింది.ఇక విశాల్తో నాకు మంచి స్నేహితుడు మాత్రమేనని,మా మధ్య ఎటువంటి ఎఫైర్ లేదని చెప్పుకొచ్చింది వరలక్ష్మీ.ఇక ఆమె విజయ్తో నటించిన సర్కార్ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది.