మాంచి స్పీడ్,ఎనర్జీతో సాయి ధరమ్ తేజ్ సెటిలైపోయేలా ఉన్నాడు. ఇప్పటికే ఒక హిట్ కొట్టి ఖాతా తెరిచిన మనోడు… మెగా కాంపౌండ్ కు మంచి ఉత్సాహాన్ని అందించేశాడు.
ఇక ఎటొచ్చి మిగిలింది వరుణ్ తేజ్ ,అల్లు శిరీష్ లే. శిరీష్ గురించి డిస్కస్ చేసుకోవడం కూడా అనవసరం. ఇక చర్చించుకోవల్సింది… వరుణ్ తేజ్ గురించే.మరి అతని పరిస్థితి ఏంటి..?
ఎప్పుడూ రిజర్వ్ గా ఉండే వరుణ్ ..బయట ఉన్నట్లే సినిమాల్లో కూడా ఉండడం మెగా స్టార్ ,నాగబాబులను కలవర పెడుతుంది. ఒక హిట్ పడితే తప్ప వరుణ్ సేలబుల్ హీరోగా అనిపించుకోలేడు.
మరి ఆ హిట్ కంచె తో వస్తుందని కూడా చెప్పలేమంటూ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే…. కంచె క్రెడిట్ మొత్తం క్రిష్ కే వెళ్లిపోవచ్చు. కృష్ణం వందే జగద్గురుమ్ లో రానాకు జరిగిందే..వరుణ్ కు జరుగుతుందంటున్నారు.
సో ఇదే విషయం గురించి నాగబాబు క్రిష్ ను సంప్రదించి ప్రమోషన్ లో మావాడిని కాస్త పైకి లేపమని చెప్పినట్లు తెలుస్తోంది.