Tuesday, May 14, 2024
- Advertisement -

వెంక‌టేశ్ త‌న సినిమా మొద‌లెట్టేశాడు

- Advertisement -
  • తేజ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ప‌నులు ప్రారంభం

బాహుబ‌లిలో ప్ర‌తినాయ‌క పాత్ర పోషించిన ద‌గ్గుబాటి రానాను ద‌ర్శ‌కుడు తేజ నేనే రాజు నేనే మంత్రిగా తీసిన సినిమా మంచి విజ‌యం అందుకుంది. ఆ సినిమా విజ‌యంతో తేజ మ‌ళ్లీ దారిలో ప‌డ్డ‌ట్టు క‌నిపిస్తోంది. ఈసారి మ‌రో సినిమాతో రాబోతున్నాడు. సీనియ‌ర్ న‌టుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్‌తో సినిమా తీయ‌నున్నాడు. ‘గురు’ సినిమా తరువాత వెంక‌టేశ్‌ తేజ దర్శకత్వంలో వ‌చ్చే సినిమాలో నటించబోతున్నాడు.ఈ సినిమా ప‌నులు సోమ‌వారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవుడి చిత్రపటాలపై వెంకటేశ్‌ క్లాప్ కొట్టారు. పరుచూరి బ్రదర్స్, రానా పాల్గొన్నారు.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు కెమెరామెన్ అభినందన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. త‌న సోద‌రుడు ద‌గ్గుబాటి సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత అందించ‌నున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. చాలా కథలు విన్న తరువాత వెంకటేష్ ఈ కథను ఒకే చేసినట్లు సమాచారం.

పీఎస్‌వీ గ‌రుడ‌వేగ సినిమా విజ‌యం సాధించిన ఆనందంలో ఉన్న రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ రాజ‌శేఖ‌ర్ కనిపించబోతున్నాడట. ఈ సినిమాకు ‘ఆట నాదే వేట నాదే’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -